హుజురాబాద్ ఓటమితో కేసీఆర్‌కు మతి పోయింది: ప్రేమేందర్ రెడ్డి

by  |
హుజురాబాద్ ఓటమితో కేసీఆర్‌కు మతి పోయింది: ప్రేమేందర్ రెడ్డి
X

దిశ, పరకాల: హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమి చెందిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మతి పోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. సోమవారం బీజేపీ అనుబంధ సంఘం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరల పై వ్యాట్‌ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పరకాల పట్టణంలో ర్యాలీ చేపట్టి, అనంతరం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలు, రైతులపై ద్వేషం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. హుజురాబాద్‌లో ఓటమితోనే ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ‌పై వ్యాట్ తగ్గించిందని.. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలంటూ ప్రేమేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అటు ధాన్యం కొనుగోళ్లు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు.



Next Story