వ్యవసాయ చట్టాలపై విషం చిమ్ముతున్నారు: పొంగులేటి

by  |
వ్యవసాయ చట్టాలపై విషం చిమ్ముతున్నారు: పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టంపై కాంగ్రెస్ పార్టీ, కొన్ని దుష్టశక్తులు విషం చిమ్ముతున్నాయని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడదల చేశారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు మోడీ ప్రభుత్వం కొత్త వ్యవసాయం చట్టాన్ని తీసుకువస్తే.. కాంగ్రెస్ పార్టీ రైతులను రెచ్చగొట్టి, బీజేపీ ప్రభుత్వంపై బురదజల్లుతుందన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, కిసాన్ సమాన్ నిధి ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద కేంద్రం రెండు లక్షల కోట్ల రూపాయలతో గ్రామస్థాయిలో రైతులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని పేర్కొన్నారు.


Next Story