ఆయన సీఎం అయ్యాకే..ఆలయాలపై దాడులు….

by  |
ఆయన సీఎం అయ్యాకే..ఆలయాలపై దాడులు….
X

దిశ వెబ్ డెస్క్:
అంతర్వేది ఘటనపై తెలంగాణ బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. జగన్ సీఎం అయ్యాకే ఆలయాలపై దాడులు పెరిగాయని అన్నారు. రథం దగ్దం ఘటనపై మంత్రులు చులకనగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. మంత్రులు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతర్వేది ఘటనపై సీఎం జగన్ వెంటనే స్పందించాలని అన్నారు. కాగా అంతర్వేది ఘటన నేపథ్యంలో ఆందోళనలకు బీజేపీ పిలుపు నిచ్చింది. దీంతో బీజేపీ నేతలను ఎక్కడిక్కడే అడ్డుకున్నారు. పలువురు నేతలను గృహనిర్బంధం చేసినట్టు తెలుస్తోంది.



Next Story

Most Viewed