- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కమలాపూర్: హరీష్ రావు ప్రచారం చేస్తున్నట్లు గ్యాస్ సిలిండర్ గుర్తుకే ఓటు వేయాలని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి హరీష్ రావు బీజేపీ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచింది అంటూ, ఓటు వేసే ముందు సిలిండర్కు దండం పెట్టి పోలింగ్కు వెళ్లాలని సెటైర్లు వేస్తున్నారని మండిపడ్డారు. సిలిండర్తోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా ఈవీఎం బ్యాలెట్లో ఉన్న 14వ నెంబర్ సిలిండర్ గుర్తుకే ఓటు వేయాలని చురకలు వేశారు. బీజేపీ నాయకులు గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ.. నియోజకవర్గంలో ఈటల చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తుంటే, టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకుల ప్రచారాలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ ఓటుకు 20వేల రూపాయలు ఇస్తాము టీఆర్ఎస్కే ఓటేయాలని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ ఓటర్లు ఆ డబ్బును తీసుకుని ఈటలకే ఓటేయాలని సూచించారు.