బీజేపీ నేత ఆత్మహత్య.. కారణం అదేనా?

by  |
బీజేపీ నేత ఆత్మహత్య.. కారణం అదేనా?
X

దిశ, వెబ్ డెస్క్ :
వెస్ట్ బెంగాల్‌లో దారుణం జరిగింది. బీజేపీ బూత్ అధ్యక్షుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆ రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా రాంనగర్ ప్రాంతంలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. రాంనగర్ బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుడు పూర్ణచంద్ర దాస్(44) అతని ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆ పార్టీ కార్యకర్తలు ఒత్తిడి తీసుకువచ్చారని, దాంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేతలు ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరేందుకు పూర్ణచంద్ర సిద్ధంగా లేరని, వారి ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తరఫు బంధువులు ఆరోపించారు. కాగా, బీజేపీ ఆరోపణలు అవాస్తవాలని తృణమూల్ కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story