ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్‌లు చేయాలి : జీవీఎల్

by  |
ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్‌లు చేయాలి : జీవీఎల్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని బీజేపీ చూస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ఓ కమిటీ ఏర్పాటు చేసిందని అన్నారు. దాంతో అభ్యర్థి విషయంలో అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అంతేగాకుండా పోలీస్‌స్టేషన్‌లలో క్రిస్మస్ వేడుకలు జరుపాలని ప్రభుత్వం ఆదేశించినట్టు గుర్తు చేశారు. దాంతో పోలీస్‌స్టేషన్‌లే వేదికగా ప్రభుత్వం మత ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తే.. ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్‌లు చేయాలని జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed