ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.. డీకే అరుణ ఫైర్

by  |
DK Aruna
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ విషయం సన్నగిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోచ్ ఫ్యాక్టరీ రాకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఆరోపణలు చేయడం తప్ప.. ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు చేయలేదని వెల్లడించారు. కొత్తవి వచ్చే అవకాశం లేదని, రాష్ట్ర ఏర్పడి ఏడేళ్లైంది, ఇప్పుడు చర్చించుకోవడం సరికాదని అన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అందరినీ కలుపుకొని పోవాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed