అయ్యవ్వకు పుట్టినోళ్లు ఎక్కడికి పోయిన్రు: డీకే అరుణ

by  |
అయ్యవ్వకు పుట్టినోళ్లు ఎక్కడికి పోయిన్రు: డీకే అరుణ
X

దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఎంతసేపు ధనార్జనే లక్ష్యంగా దోపిడీ పర్వాన్ని వివిధ రూపాలల్లో కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకోకుండా కాంగ్రెస్, టీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. సోమవారం ఆమె సోషల్ మీడియా ద్వారా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర సచివాలయం విషయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి కేసీఆర్ కుట్రకు తెరలేపారని విమర్శించారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు కేసీఆర్ తెరలేపారని, కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్పందించకుండా టీఆర్ఎస్ తో కలసి నీచ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. బైంసాలో హిందువులపై దాడులు జరిగినప్పుడు అయ్యవ్వకు పుట్టినోళ్ళు ఆనాడు ఎక్కడికి పోయారని మండిపడ్డారు. 20 ఇండ్ల విధ్వంసం జరిగినప్పుడు కాంగ్రెస్ నాయకులకు హిందూ ధర్మం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. కరోనా పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. బీజేపీ కి ఏ సమయంలో ఏది చేయాలో బాగా తెలుసని, సెక్రటేరియట్ లో పోచమ్మ మందిరాన్ని ఎలా నిర్మించాలో బీజేపీ తెలుసని పేర్కొన్నారు.

Next Story

Most Viewed