ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తోంది

by  |
ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తోంది
X

దిశ, వెబ్‎డెస్క్: ఎస్సీ, ఎస్టీలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పాస్టర్లు పొందిన ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ సొమ్మును ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. హిందు మత ప్రచారానికి ఖర్చు చేయాల్సిన నిధులను ఇతర నిర్మాణాలకు ఖర్చు చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చూపే ప్రయత్నం చేస్తోందన్నారు.

Next Story

Most Viewed