- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: సమాజంలో వైషమ్యాలు సృష్టించేలా స్వేరోస్ కార్యక్రమాలున్నాయని, సీఎం కేసీఆర్ ప్రోద్భలంతోనే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం స్వేరోస్ సంస్థ వ్యవహార శైలిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వేరోస్కు నిధులెక్కడి నుంచి వస్తున్నాయో ప్రభుత్వం చెప్పాలని, సంస్థకు సంబంధించిన లెక్కలు మీరు తీస్తారా..? లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి అక్కడి నుంచి తీసేలా చేయమంటారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో హిందువులను కించపరిచే కార్యక్రమాలు జరుగుతుంటే ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ హిందూ వ్యతిరేకులను ప్రోత్సహించడమే తన పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేసీఆర్ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే పతనం అవడం ఖాయమన్నారు. స్వేరోస్ సంస్థ అంశాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.