పవన్ నిర్ణయం బాధేసింది : బండి సంజయ్

by  |
Bandi Sanjay, Pawan Kalyan
X

దిశ, తెలంగాణ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడం బాధేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌‌తో తమకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవన్నారు. ఆయనకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే తన దృష్టికి లేదా కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకురావాల్సిందన్నారు. మొన్నటివరకూ అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన.. ఎన్నికల సమయంలో మద్దతుగా మాట్లాడడం జనాన్ని అయోమయానికి గురి చేసిందన్నారు. కనీసం గ్రాడ్యూయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్‌ బీజేపీకి మద్దతు ఇవ్వకపోయినా న్యూట్రల్‌గా ఉంటే బాగుండేదన్నారు.



Next Story

Most Viewed