తీన్మార్ మల్లన్న కు మద్దతుగా బీజేపీ.. ధర్నాలో దిష్టి బొమ్మ దహనం..

by  |
తీన్మార్ మల్లన్న కు మద్దతుగా బీజేపీ.. ధర్నాలో దిష్టి బొమ్మ దహనం..
X

దిశ హన్మకొండ టౌన్: బీజేపీ నాయకుడు, ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దాడిని ఖండిస్తున్నామని హన్మకొండ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. నిన్న తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడికి నిరసనగా శనివారం బీజేపీ నాయకులు కార్యకర్తల తో కలసి హనుమకొండ – ఖమ్మం బైపాస్ రోడ్ గణపతి ఇంజనీరింగ్ కళాశాల వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇంఛార్జి డాక్టర్ వి.మురళీధర్ గౌడ్, మాజీ మంత్రి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయరామరావు, రాష్ట్ర నాయకులు దామోదర్ రెడ్డి, గురుమూర్తి శివకుమార్, గుజ్జ సత్యనారాయణ రావు, కాచం గురుప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి, దేశీనీ సదానందం గౌడ్, ఆర్.పి. జయంతి లాల్, కొండి జితేందర్ రెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story