వలస కూలీలకు చేయూత 

by  |
వలస కూలీలకు చేయూత 
X

దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్‌తో జిల్లాలోని మిడ్జిల్ గ్రామంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలకు బీజేపీ చేయూతనందించింది. ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు జేపి నడ్డా, బండి సంజయ్‌ల పిలుపుమేరకు గ్రామంలోని వలస కూలీలకు 20 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర సరకులను బీజేపీ జిల్లా కార్యదర్శి రాజేశ్వర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో మనమందరం ఇళ్లకే పరిమితమై, మనల్నీ, మన కుటుంబాన్ని కరోనా నుంచి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె తిరుపతి, బీజేపీ మండల మాజీ అధ్యక్షులు జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.

Tags: rice distribution, bjp, midjil, migrant labourers, corona, lockdown, bandi sanjay,

Next Story

Most Viewed