‘మాకు బాధ్యతలు అప్పగించండి..‘

by  |
‘మాకు బాధ్యతలు అప్పగించండి..‘
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీలో కొత్త కార్పొరేటర్లను గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. 44మంది బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం ప్రగతి భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చట్టప్రకారం కొత్త కార్పొరేటర్లకు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. కొత్తపాలక వర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికల్లో గెలిచినప్పటికీ డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని వాపోయారు. ఎన్నికలు ముగిసి నెల రోజులవుతున్నా పాత కార్పొరేటర్లే పెత్తనం చేస్తున్నారంటూ వాపోయారు. ప్రజల ఓట్లకు విలువ లేకుండాపోయిందని, ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున పోలీసుల బందోబస్తు నిర్వహించారు.

Next Story

Most Viewed