బీజేపీ కార్పొరేటర్లు టచ్‌లో ఉన్నారు : ఎమ్మెల్యే

by  |
బీజేపీ కార్పొరేటర్లు టచ్‌లో ఉన్నారు : ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: 2023లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యాఖ్యలు అర్ధరహితం అని కొట్టిపారేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం నిబద్ధత కలిగి ఉన్నామని గుర్తుచేశారు. కొన్ని సీట్లు గెలిచినంత మాత్రాన బీజేపీతో ఒరిగేదేమీ లేదు అని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును టీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తుందని స్పష్టం చేశారు. అంతేగాకుండా చాలామంది బీజేపీ కార్పొరేటర్లు తమతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పగటికల అని ఎద్దేవా చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story