- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: ఏ కార్యక్రమం చేపట్టిన పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా సోము వీర్రాజును తాడేపల్లిలోని ఆయన నివాసంలో నిర్బంధించారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మీడియాతో మాట్లాడుతూ హిందువుల పట్ల ప్రభుత్వం చులకన భావంతో ఉందన్నారు. దీన్ని సహించేది లేదని, ఇంకా ఆందోళనను ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించిన ఎమ్మెల్సీ మాధవ్తోపాటు పాటిబండ్ల రామకృష్ణ, కె.సైతారావును అరెస్టు చేశారు. గుంటూరు నగరంలో కన్నా లక్ష్మీనారాయణను, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణాన్ని వారి నివాసాల్లో నిర్బంధించారు. పలువురు కార్యకర్తల్ని అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు.