- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: జమ్మూ-కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించే వరకు జాతీయ జెండాను ఆవిష్కరించనని చెప్పిన మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. జమ్మూ-కశ్మీర్లో ప్రత్యేక జెండాను ఎగరేయడానికి అనుమతి ఇచ్చినపుడే జాతీయ జెండాను ఎగరేస్తానని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు.
దీనిపై స్పందించిన బీజేపీ.. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించింది. బీజేపీ అధ్యక్షుడు రవీందర్ స్పందిస్తూ..మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కోరారు. ఆమె వ్యాఖ్యలు దేశద్రోహం పరమైనవి. దేశద్రోహ చట్టం కింద అరెస్ట్ చేయాలంటూ, జమ్మూ-కశ్మీర్ దేశంలో అంతర్భాగం కాబట్టి జాతీయ జెండాను ఎగరేయాలి’ అని తెలిపారు.
ముఫ్తీ వ్యాఖ్యలను ఆమోదించలేమని, జాతీయ జెండా భారత పౌరుల సమగ్రత, ఐక్యత, త్యాగాలను చాటుతుందని, అలాంటి జెండాను తక్కువ చేయడానికి వీల్లేదని, అలా చేస్తే ప్రజాస్వామ్య పాలన కోసం పోరాడిన వారి త్యాగాలను కించపరిచినట్లేనని పీసీసీ అధికార ప్రతినిధి రవీందర్ శర్మ చెప్పారు.