విద్యుత్ చార్జీలు మాఫీ చేయాలి: బీజేపీ

by  |
విద్యుత్ చార్జీలు మాఫీ చేయాలి: బీజేపీ
X

దిశ, న్యూస్‌బ్యూరో: విద్యుత్ చార్జీలను మాఫీ చేసి మధ్య తరగతి ప్రజలను ఆదుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈమేరకు బుధవారం ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ప్రేమేందర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డికి మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా రాంచదర్‌రావు మాట్లాడుతూ లాక్‌డౌన్ సమయంలో విద్యుత్ చార్జీలను పెంచడం వల్ల పేద ప్రజలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. సామాన్యులు బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని, సీఎంను కలిసి సమస్యను తెలుపుదామంటే సమయం ఇవ్వడం లేదన్నారు. లాక్‌డౌన్ సమయంలో కరెంట్ బిల్లులను మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed