ఎమ్మెల్సీ అభ్యర్ధుల్ని ప్రకటించిన తెలంగాణ బీజేపీ

by  |
BJP
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధుల్ని బీజేపీ ప్రకటించింది. రంగారెడ్డి – హైదరాబాద్ – మహబూబ్ నగర్ సిట్టింగ్ అభ్యర్ధిగా రామచంద్రరావు, నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డిల ఎంపికను ఖరారు చేసింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం మధ్యనున్న లోపాయికారి ఒప్పందం మరోసారి బహిర్గతమైందన్నారు.

ఎన్నికల వేళ తాము చెప్పింది మరోసారి ప్రూవ్ అయింది. సిగ్గులేకుండా ఎన్నికల్లో మేం వేర్వేరు అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ కలిసిపోయారు. రెండూ కలిసి పోటీ చేయకపోయి ఉంటే టీఆర్ఎస్‌కు సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదని బండి సంజయ్ మండిపడ్డారు. కాగా, టీఆర్‌ఎస్ పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రావడానికి ఎంఐఎం పార్టీ సపోర్టు చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed