- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ. గోదావరిఖని: అతి వేగమో లేక మద్యం మత్తులోనో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అర్ధరాత్రి ఎందుకు వెళ్లారో, ఎటు వెళ్తున్నారో తెలియదు. కానీ ప్రమాదం జరిగిన దృశ్యాలు పలువురిని కలచివేశాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేష్ నగర్ లో మంగళవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
రాంనగర్ కు చెందిన శివరాం, మహేష్, సిద్దు అనే ముగ్గురు యువకులు జావహర్ లాల్ నగర్ వైపు అర్ధరాత్రి ద్విచక్ర వాహనం అతివేగంగా వెళ్తూ మెకానిక్ షాప్ గోడకు ఢీ కొనడంతో శివరాం అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మహేష్ చికిత్స పొందుతూ కరీంనగర్ లో మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదం మద్యం మత్తులో అతివేగంతో జరిగినట్లు సమాచారం. మృతి చెందిన ఇద్దరు యువకుల మృతదేహాలను గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సిద్దు కరీంనగర్ లో చికిత్స పొందుతున్నాడు.