సైకో భర్త.. భార్య, పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు

by  |
సైకో భర్త.. భార్య, పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆవేశంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా తన భార్య, ఇద్దరు పిల్లలను ఇంట్లో ఉంచి.. ఇంటికి నిప్పంటించాడు సదరు వ్యక్తి. ఈ ఘటన బీహార్‌లోని కటిహార్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. లాభా గ్రామానికి చెందిన మొహమ్మద్ తాహిర్‌కు, అతని భార్యకు మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా కోపంలో తాహిర్, భార్యతో పాటు.. ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు.

మంటల్లో కాలిపోతున్న వారి అరుపులు విన్న స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే వారు అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ నేపథ్యంలో నిందితుడు తాహిర్ ఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు యత్నించాడు. వెంటనే తాహిర్‌ను పట్టుకుని గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Next Story