టపాసులు పేలి ఒకరు దుర్మరణం

by  |
టపాసులు పేలి ఒకరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్ : టపాసులు పేలి బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఏపీలోని విజయవాడ బాపులపాడు మండలం వీరవల్లిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రా ఫార్మా కంపెనీలో పనిచేసేందుకు వచ్చిన రంజిత్ కుమార్ అనే వ్యక్తి ఆ కంపెనీ క్వార్టర్స్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు.

పండుగ రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లలో టపాసులు పెట్టి పేల్చారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న రంజిత్‌కు ఎగిరొచ్చిన బండరాయి తలకు తగలడంతో తీవ్రగాయమైంది. రక్తస్రావం ఎక్కువగా కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం మరణించినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.

;

Next Story

Most Viewed