ముంబై పోలీసులు… మాకు సహకరించడం లేదు

by  |
ముంబై పోలీసులు… మాకు సహకరించడం లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు అనేక మలుపులు తిరిగి, ఆయన ప్రియురాలు రియా చక్రబర్తిని సైతం పోలీసులు విచారించిన విషయమూ తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వాగతించారు. సుప్రీంకోర్టే తీర్పును వెలువరించిన తర్వాత…

ఈ విషయంలో మరో మాటకు తావు లేదని అన్నారు. సుశాంత్ కుటుంబానికి న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.

ఏదైనా ఒక కేసుకు సంబంధించి బీహార్ పోలీసులకు ఫిర్యాదు వచ్చిన తర్వాత దర్యాప్తు చేయడం రాష్ట్ర పోలీసుల విధి అని నితీశ్ అన్నారు. అయితే, ముంబై పోలీసులు తమ పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని చెప్పారు. ముంబై పోలీసుల తీరును ప్రపంచమంతా చూస్తోందన్నారు. బీహార్ పోలీసుల చర్య సరైనదనే విషయం సుప్రీం తీరుతో అర్థమవుతోందని చెప్పారు. మరోవైపు, విచారణ కోసం వెళ్లిన బీహార్ ఐపీఎస్ అధికారిని ముంబైలో బలవంతంగా క్వారంటైన్ చేసి, ఆ తర్వాత వదిలిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed