వేములకొండలో హనుమాన్ విగ్రహం

by  |
వేములకొండలో హనుమాన్ విగ్రహం
X

నల్లగొండ జిల్లా వలిగొండ మండలం వేములకొండలో శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో.. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్వరెడ్డి పాల్గొన్నారు. వారికి స్థానిక ఎమ్మేల్యేలు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఆలయంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన నేతలు అనంత‌రం ఆంజ‌నేయ విగ్ర‌హ ప్ర‌తిష్ట కార్యక్ర‌మంలో పాల్గొన్నారు. ఆల‌య అభివృద్ధికి త‌మ వంతు కృషి చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed