జీఎస్టీ చెల్లింపుదారులకు ఉపశమనం!

by  |
జీఎస్టీ చెల్లింపుదారులకు ఉపశమనం!
X

దిశ, వెబ్‌డెస్క్: జీఎస్టీ పన్నుచెల్లింపుదారులకు కేంద్రం అతిపెద్ద ఉపశమనం కల్పించింది. 2017 జులై నుంచి 2020 జులై వరకు పన్ను కాలానికి జీఎస్టీఆర్-3బీ రిటర్న్‌లకు గరిష్ట ఆలస్య రుసుమును రూ.500కే పరిమితం చేసింది. ఈ నిర్ణయంతో 2020 సెప్టెంబర్ 30లోపు రిటర్న్ దాఖలు చేసిన వారికి ఆలస్య రుసుము రూ. 500 మాత్రమే వసూలు చేయనున్నట్టు కేంద్ర పరోక్ష పన్నుల బోర్డ్(సీబీఐసీ) శుక్రవారం వెల్లడించింది. అయితే తగ్గించిన ఆలస్య రుసుము 2020 సెప్టెంబర్‌ 30 వరకూ దాఖలు చేసిన జీఎస్టీఆర్‌-3బీ రిటర్న్‌లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed