రిజర్వాయర్లలో పూడికతీతకు బిడ్లు

by  |
రిజర్వాయర్లలో పూడికతీతకు బిడ్లు
X

దిశ, వెబ్‎డెస్క్ :
రిజర్వాయర్లలో పూడిక నిల్వ, నీటి సామర్థ్యాల సర్వేల కోసం బిడ్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏలేశ్వరం, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయల్లో పూడిక, నిల్వ సామర్థ్యాల సర్వే కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం, రాళ్లపాడు, మైలవరం రిజర్వాయర్లలో బాతోమెట్రిక్ సర్వే చేయనుంది. జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద పోటీబిడ్లను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనుల అంచనాల రూపకల్పన కోసం జలవనరుల శాఖ నేతృత్వంలో సాంకేతిక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Next Story

Most Viewed