ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. భువనేశ్వర్ కుమార్

by  |
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. భువనేశ్వర్ కుమార్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో 22.50 సగటుతో 6 వికెట్లు, టీ20 సిరీస్‌లో 28.15 సగటుతో 4 వికెట్లు తీశాడు. దీంతో అతడికి మార్చి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది. ఈ ఏడాది జనవరిలో ప్రవేశపెట్టిన ఈ అవార్డు వరుసగా ముగ్గురు భారత క్రికెటర్లకే లభించడం గమనార్హం. జనవరిలో రిషబ్ పంత్, ఫిబ్రవరిలో రవిచంద్రన్ అశ్విన్‌కు లభించగా.. తాజాగా భువనేశ్వర్ కుమార్ ఈ అవార్డును గెలుచుకున్నారు. మార్చి నెలలో భువీతో పాటు జింబాబ్వేకు చెందిన షాన్ విలియమ్స్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్ కూడా నామినేట్ అయ్యారు. అయితే అన్‌లైన్ ఓటింగ్‌తో పాటు సీనియర్ జర్నలిస్టులు, మాజీ క్రికెటర్లు, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ సభ్యులు నిర్ణయించిన మేరకు విజేతను ఎంపిక చేస్తారు.


Next Story

Most Viewed