ఎంపీ కోమటిరెడ్డికి కరోనా పాజిటివ్

by  |
ఎంపీ కోమటిరెడ్డికి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంతేగాకుండా రోజూ అనేకమంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కరోనా బారిన పడుతుండటంతో సామాన్య జనాల్లో మరింత కలవరం మొదలైంది. తాజాగా కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

కాగా ఇటీవల దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా దౌల్తాబాద్ మండలానికి కోమటిరెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన మండలంలో రోజూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కాస్త అనారోగ్యంగా ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. కాగా గురువారం వచ్చిన రిపోర్టులో ఆయనకు పాజిటివ్ ఉన్నట్టు వైద్యులు తేల్చారు. దీంతో ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

Next Story

Most Viewed