ప్రధాని మోడీకి భూటాన్ అత్యున్నత పురస్కారం

by  |
PM Modi
X

థింపూ: ప్రధానమంత్రి నరేంద్రమోడీని భూటాన్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. ‘నగడగ్ పెల్ గి ఖోర్లో’ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు శుక్రవారం భూటాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని భూటాన్ ప్రధాని ట్వీట్ ద్వారా వెల్లడించారు. ‘అత్యున్నత పురస్కారానికి మోడీజీని ఎంపిక చేయడం పట్ల మిక్కిలి సంతోషంగా ఉన్నాను’ అని ట్వీట్ చేశారు. గతంలోనూ ప్రధాని మోడీకి పలు దేశాలు ఆయా అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. వీటిలో సౌదీ అరేబియా, అఫ్ఘానిస్తాన్, పాలస్తీనా, యూఏఈ, రష్యా, మాల్దీవ్స్, బహ్రెయిన్ వంటి దేశాలు ఉన్నాయి.

Next Story

Most Viewed