బోయిన్‌పల్లి పీఎస్‌లో హాజరైన భూమా అఖిలప్రియ

by  |
బోయిన్‌పల్లి పీఎస్‌లో హాజరైన భూమా అఖిలప్రియ
X

దిశ, కంటోన్మెంట్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. సికింద్రాబాద్ కోర్టు ఆదేశాలనుసారం బోయిన్‌పల్లి పీఎస్‌కు హాజరైన అఖిలప్రియ.. ఏసీపీ నరేష్ రెడ్డి సమక్షంలో సంతకం చేశారు. కేసు విచారణలో భాగంగా భూమా అఖిలప్రియను పోలీసులు పలు విషయాల్లో ప్రశ్నించారు. ఉదయం పదిన్నర గంటలకు హాజరైన అఖిలప్రియ.. గంటన్నరపాటు స్టేషన్‌లోనే ఉండి విచారణకు సహకరించినట్లు ఏసీబీ నరేష్ రెడ్డి తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి భూమా అఖిల ప్రియ పోలీసు స్టేషన్‌కు వచ్చిన సంతకం చేస్తుందని తెలిపారు. భార్గవ్ రామ్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed