బెంగాల్‌లో ఉత్కంఠ పోరు.. దీదీ గెలిచేనా.. ఓట్ల లెక్కింపు షురూ..

by  |
బెంగాల్‌లో ఉత్కంఠ పోరు.. దీదీ గెలిచేనా.. ఓట్ల లెక్కింపు షురూ..
X

దిశ, వెబ్‌డెస్క్ : బెంగాల్ మరో కీలక ఘట్టానికి తెర లేచింది. దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బెంగాల్ భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితం ఆదివారం వెలువడనున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ప్రక్రియ ప్రారంభమైంది. 21 రౌండ్లలో ఈ కౌంటింగ్​ప్రక్రియ జరగనుంది.

భవానీపూర్‌తో పాటు బెంగాల్‌లోని సంసేర్​గంజ్, జంగీపుర్ ఉపఎన్నికల ఫలితాలు కూడా ఆదివారం వెలువడనున్నాయి. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మోహరించాయి. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన మమతా బెనర్జీ.. ఈ ఉపఎన్నికలో భవానీపూర్‌ నుంచి పోటీ చేశారు. మమతకు పోటీగా బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రివాల్‌ బరిలో ఉన్నారు.

Next Story

Most Viewed