బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: భట్టి విక్రమార్క

by  |
బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: భట్టి విక్రమార్క
X

దిశ‌, ఖ‌మ్మం: ఇళ్లు కాలిపోయి రోడ్డుమీద‌ ప‌డ్డ అబ్బుగూడెం బాధితుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెంలో నెల‌రోజుల క్రితం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 16 కుటుంబాలు నివాసం ఉంటున్న ఇండ్లు కాలిపోయాయి. ఈ నేప‌థ్యంలోనే బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు బుధ‌వారం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య గ్రామంలో ప‌ర్య‌టించారు. బాధితులతో మాట్లాడిన సీఎల్పీ నేత వారికి నెల‌రోజులకు స‌రిప‌డా నిత్యావసరాల‌ను పంపిణీ చేశారు. అలాగే చేతి ఖ‌ర్చుల నిమిత్తం ఒక్కో కుటుంబానికి రూ.5000 అందజేశారు. ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించి నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను మంజూరు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed