ఆ కంపెనీలో ఉద్యోగులకు ఎగ్జిట్ ఆఫర్..

by  |
ఆ కంపెనీలో ఉద్యోగులకు ఎగ్జిట్ ఆఫర్..
X

దిశ, వెబ్ డెస్క్: భారత దేశంలోని రెండ్ అతిపెద్ద ఇంధన రిటైలర్ ప్రభుత్వ సంస్థ అయిన బీపీసీఎల్(భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్) ఉద్యోగులకు సచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. తదనంతరం ఈ సంస్థను ప్రభుత్వం ప్రయివేటీకరించిన విషయమూ అందరికీ తెలిసిందే. సంస్థలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు కంపెనీలో పనిచేయలేని ఉద్యోగులు స్వచ్ఛందంగా పదవీ విరమణ ప్రకటించుకునే అవకాశం కల్పించినట్టు సంస్థ ఓ నోటీసు ద్వారా తెలిపింది. దాదాపు 45 ఏండ్ల వయస్సు ఉన్న వ్యక్తులు వీఆర్ఎస్ తీసుకోవడానికి అర్హులు అని ప్రకటించింది. దీంతో ఈ సంస్థ తీసుకున్న నిర్ణయాలనే పలు ప్రభుత్వరంగ సంస్థలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రశేశ పెట్టిన సంస్థలు కూడా మరోసారి అమలు చేయాలని చూస్తున్నాయి. కాగా… జూలై 23 న ప్రారంభమైన ఈ పథకం… ఆగస్టు 13 వరకు అమల్లో ఉంటుంది.

దాదాపు 5-10 శాతం మంది ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.



Next Story

Most Viewed