ఆమె క్రష్‌లో బాహుబలి..

by  |
ఆమె క్రష్‌లో బాహుబలి..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో.. కోట్లాది హృదయాలను దోచుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ. తొలి సినిమాతోనే ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ హీరోయిన్.. హిందీ, మరాఠి, కన్నడ, భోజ్‌పురి సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆ తర్వాత లైఫ్ బిజీలో పడిపోయిన అలనాటి అందాల తార.. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయబోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో కంగనా రనౌత్ ‘తలైవి’ చిత్రం ఒకటి కాగా, ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మరొకటి. ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ మనసులో మాటను బయటపెట్టేసింది.

రాధేశ్యామ్ సినిమాలో భాగ్యశ్రీ.. రెబల్ స్టార్ ప్రభాస్‌‌కు తల్లిగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఒకానొక సమయంలో తనపై క్రష్‌ ఉండేదని ప్రభాస్ చెప్పినట్టు వెల్లడించింది భాగ్యశ్రీ. ప్రభాస్ చాలా జోవియల్ పర్సన్ అని, తన కోసం హైదరాబాదీ స్వీట్లను గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలిపింది. రాధేశ్యామ్ సినిమా యూనిట్‌లో చాలా మంది తన ‘మైనే ప్యార్ కియా’ చిత్రానికి వీరాభిమానులున్నారని చెప్పుకొచ్చింది.

కాగా ‘రాధే శ్యామ్‌’లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో, ఇటు ఇండస్ట్రీలో భారీగా అంచనాలున్నాయి.



Next Story

Most Viewed