ఐద్వా నూతన కమిటీ ఎన్నిక.. పట్టణ అధ్యక్షురాలుగా జ్యోతి

by  |
aidva
X

దిశ, భద్రాచలం: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) భద్రాచలం పట్టణ నూతన కమిటీ మంగళవారం ఎన్నికైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐద్వా అధ్యక్షురాలు ఎస్ రాజమ్మ, జిల్లా కార్యదర్శి జ్యోతిల సమక్షంలో 29 మందితో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఇందులో10 మందిని ఆఫీసు బ్యారెర్స్‌గా ఎన్నుకున్నారు. భద్రాచలం పట్టణ ఐద్వా అధ్యక్షురాలుగా యు. జ్యోతి, కార్యదర్శిగా డి. సీతాలక్ష్మిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. రానున్న కాలంలో మహిళా సమస్యలపైన, హింసాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. మహిళా చట్టాల అమలు కోసం వారిని చైతన్యవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐద్వా నాయకులు ఎన్ లీలావతి, బి. కుసుమ, ఎస్.గంగ, ఎ. సక్కుబాయి, జీవన జ్యోతి, సీహెచ్ రమణ, జి. రాధ తదితరులు పాల్గొన్నారు.


Next Story