ప్రజల వద్దకే వెళ్లి… కరోనా పరీక్షలు

by  |
ప్రజల వద్దకే వెళ్లి… కరోనా పరీక్షలు
X

దిశ, కొత్తగూడెం: కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సంచార వాహనాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంచార వాహనం ద్వారా ప్రజల వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మారుమూల ప్రాంత ప్రజలకు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహణకు ఈ సంచార వాహనం చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ అశోక్ చక్ర వర్తి, జిల్లా వైద్యాధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed