గ‌ర్భిణి క‌ష్టాల‌పై స్పందించిన క‌లెక్ట‌ర్

by  |
గ‌ర్భిణి క‌ష్టాల‌పై స్పందించిన క‌లెక్ట‌ర్
X

దిశ‌, కొత్త‌గూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం, నర్సాపురం గ్రామానికి చెందిన నునావత్ మమత పురిటి నొప్పులతో బాధపడుతూ వాగుదాటుతున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో భ‌ద్రాద్రి క‌లెక్ట‌ర్ ఎంవీ రెడ్డి స్పందించారు. ఘటనపై సమగ్ర వివరాలు అందించాలని, ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కపుడు తనకు తెలియచేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. శుక్ర‌వారం ఉద‌యం పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతూ వాగు దాటే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో బంధువులు ఆమెను భూజాల‌పై మోసుకుని మ‌ల్ల‌న్న వాగును దాటించారు.



Next Story