- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బ్రేకింగ్ న్యూస్: నేడు టీఆర్ఎస్కు రాజీనామా చేయనున్న కీలక నేతలు

దిశ, దుమ్ముగూడెం: అధికార టీఆర్ఎస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. అసంతృప్తిగా ఉన్న నేతలు నేడు పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక సమయంలో ఈ లుకలుకలు కలకలం రేపుతున్నాయి. మండల అధ్యక్ష పదవి కోసం రెండువర్గాలు తమదైన శైలీలో వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నినప్పటికీ.. అధినాయకత్వం మాత్రం రెండు వర్గాలను సమన్వయం చేస్తున్నామని చెబుతూనే ఓ వర్గానికి పూర్తిగా మొండిచేయి చూపింది.
దీంతో అసంతృప్తిగా ఉన్న పూజారి సూర్యచంద్రరావు వర్గంగా ఉన్న రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బత్తుల శోభన్ బాబు, నర్సాపురం సర్పంచ్ వర్షా శివరామకృష్ణతోపాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున రాజీనామా చేస్తామని ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు అన్నే సత్యనారాయణ మండలంలో టీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించారని, ప్రతిపక్ష పార్టీలతో జతకట్టారని ఆరోపణలు చేశారు. అధ్యక్షుడి ఎన్నిక విషయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ తెల్లం వెంకట్రావు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, ఈ నేపథ్యంలోనే పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పార్టీకి నేడు రాజీనామా చేయనున్నారని వారు తెలిపారు.