- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,తెలంగాణ బ్యూరో : రాబోయే ఉత్సవాలు, పండుగలను దృష్టిలో ఉంచుకొని రద్దీగా ఉండే ప్రదేశాల్లో కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని లేదంటే కరోనా విజృంభించే అవకాశం ఉందని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. రాష్ట్రాల్లో జరిగే గణేష్ ఉత్సవాలు, పండుగల నిర్వహణలో కొవిడ్ రూల్స్ పాటించాలని అన్ని రాష్ట్రాల సీఎస్లకు బుధవారం కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న బోనాలు ఉత్సవాల్లో ప్రజలు భారీ ఎత్తున గుమిగూడుతున్నందున కరోనా విజృంభించే అవకాశం ఉందని సూచించింది. కరోనా కేసులు పెరిగితే ఆ బాధ్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది. కేంద్రం సూచించిన ఐదు దశల వ్యూహాలైన టెస్ట్- ట్రాక్- ట్రీట్- టీకా అమలుపరచి కొవిడ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని తెలిపింది.
Next Story