‘రాసలీలల మంత్రిని కూడా బర్తరఫ్ చేయాలి’

by  |
‘రాసలీలల మంత్రిని కూడా బర్తరఫ్ చేయాలి’
X

దిశ, కరీంనగర్ సిటీ: రాసలీలల మంత్రిగా పేరుగాంచిన జిల్లాకు చెందిన మంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు బేతి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో అనేక ఏళ్లుగా గ్రానైట్ మాఫియా, ఇసుక మాఫియా, భూకబ్జాల మాఫియా, కాంట్రాక్ట్ మాఫియా, కమీషన్ల మాఫియా, టెండర్ల మాఫియా, గుట్కా మాఫియా, వ్యాపార మాఫియా, అధికారుల బదిలీ మాఫియాలతో వేల కోట్ల రూపాయలు అక్రమంగా మాఫియాల మంత్రి సంపాదిస్తుంటే తెరాస అధినేత కేసీఆర్‌కు కనపడటం లేదా అని ప్రశ్నించారు.

బొమ్మకల్ భూమాఫియా, హిందూ శ్మశాన వాటిక కబ్జాలతో పాటు కరీంనగర్ శివారు గ్రామాలలో మంత్రి, ఆయన బినామీలు చేస్తున్న అక్రమ భూకబ్జాలపై అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ మంత్రి అవినీతితో వేల కోట్లు అక్రమంగా సంపాదిస్తూ ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఇదే కాకుండా అమాయక యువతితో రాసలీలలు నడిపిన తతంగం కూడా మీడియాలో వచ్చినప్పటికీ తెరాస బాస్ చూసి చూడనట్లు వ్యవహరించిన సంగతి కూడా ప్రజలందరికీ విదితమేనన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో మానవ బాంబుగా మారుతానని తుస్ పటాకగా మారి చరిత్రలో నిలిచిన ఈ మాఫియాల మంత్రిని కేసీఆర్ వెనకేసుకస్తూన్నాడని ఘాటు విమర్శలు చేసారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెరాస అధినేతకు వెన్నంటి ఉండి అనేక ఉద్యమాలతో రాష్ట్రం సిద్దించడానికి, అలాగే తెరాస ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన ముఖ్య నేతల్లో మొదటి వరుసలో ఉన్న బిసీ నేతగా అనేక నిర్ణయాల్లో కీలక వ్యక్తిగా కొనసాగుతున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ను తమ గుపిట్లో ఉన్న మీడియా చానళ్ళలో ప్రసారం చేసిన వెంటనే ఈటల భూకబ్జా పై విచారణకు ఆదేశించిన తెరాస అధినేత కేసీఆర్ మరి ఈ మాఫియాల, రాసలీలల మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయకుండా కాపాడటంలో అంతర్యమేమిటో కేసీఆర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. అనేక ఏళ్లుగా వ్యాపారాల ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేస్తూ అది తన సొమ్ముగా చూపెడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ఈ మాఫియా మంత్రి పై వెంటనే సీబీఐ విచారణకు అదేశించి వెంటనే బర్తరఫ్ చేయాలని బేతి మహేందర్ రెడ్డి తెరాస అధినేతను డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed