- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొలగిన మదుపర్ల భయం…లాభాల్లో సూచీలు!
by Harish |
<p> దేశీయ మార్కెట్లు బుధవారం సైతం లాభాలతోనే ముగిశాయి. మంగళవారం భారీ లాభాలతో ముగించిన తర్వాత బుధవారం అదే స్థాయిని కొనసాగించాయి. బడ్జెట్ విషయంలో మదుపర్లకు స్పష్టత రావడం, అంతర్జాతీయంగా చమురు ధరలు దిగడం, అంతర్జాతీయ మార్కెట్లు సైతం సానుకూల సంకేతాలను ఇస్తుండటంతో దేశీయ మార్కెట్లు లాభాలను చూస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 353 పాయింట్ల లాభంతో 41,142 […]</p>

X
దేశీయ మార్కెట్లు బుధవారం సైతం లాభాలతోనే ముగిశాయి. మంగళవారం భారీ లాభాలతో ముగించిన తర్వాత బుధవారం అదే స్థాయిని కొనసాగించాయి. బడ్జెట్ విషయంలో మదుపర్లకు స్పష్టత రావడం, అంతర్జాతీయంగా చమురు ధరలు దిగడం, అంతర్జాతీయ మార్కెట్లు సైతం సానుకూల సంకేతాలను ఇస్తుండటంతో దేశీయ మార్కెట్లు లాభాలను చూస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 353 పాయింట్ల లాభంతో 41,142 వద్ద ముగిసింది. నిఫ్టీ 109 పాయింట్లు లాభపడి 12,089 వద్ద క్లోజయింది. ప్రధానంగా టాటా స్టీల్, యస్ బ్యాంకు, టాటా మోటార్స్ లాభాలను చవి చూడగా, హీరో మోటో కార్ప్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, మారుతీ సుజుకీల షేర్లు నష్టాలతో క్లోజయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడి రూ. 71.22 వద్ద ఉంది.
Next Story






