ఢిల్లీ హైకోర్టులో ఫిజికల్‌గా విచారణ

by  |
ఢిల్లీ హైకోర్టులో ఫిజికల్‌గా విచారణ
X

న్యూఢిల్లీ: కరోనా కారణంగా వర్చువల్ విచారణ చేపడుతున్న న్యాయమూర్తులు మళ్లీ న్యాయస్థానాల్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఢిల్లీ హైకోర్టులో ఐదు బెంచ్‌లు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రొటేషన్ పద్ధతిలో ఫిజికల్‌గా విచారణ చేపట్టనున్నాయి.

అందుకు అనుగుణంగా నిబంధనలను విడుదలను జారీ చేశారు. మిగతా బెంచ్‌లు వర్చువల్ విచారణనే కొనసాగించనున్నాయి. కాగా, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లిస్టెడ్ అయిన కేసులు నవంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీలకు వాయిదా వేసినట్టు రిజిస్ట్రార్ జనరల్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Next Story