కరోనా ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న బెల్జియం!

by  |
కరోనా ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న బెల్జియం!
X

బ్రస్సెల్స్: కరోనా వైరస్ నేపథ్యంలో బెల్జియం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. దేశ వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూని విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిరోజులుగా బెల్జియంలో కూడా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గతవారం సగటున రోజుకు 6వేల మందికిపైగా మహమ్మారి బారినపడ్డారు. దీంతో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై బెల్జియం ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం కోసం దేశ వ్యాప్తంగా నెలరోజులపాటు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది.



Next Story

Most Viewed