పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా పరీక్షలు ప్రారంభం

by  |
పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా పరీక్షలు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13సెంటర్లలో మొత్తం 1,187 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1,140 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 47మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. కొవిడ్-19 నేపథ్యంలో అన్ని పరీక్షాకేంద్రాల్లో పట్టిష్ఠ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించిన తర్వాతే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. పరీక్షా కేంద్రాలను ఎగ్జామ్‌కు ముందు రోజుతో పాటు, పరీక్ష తర్వాత శానిటైజ్ చేస్తున్నారు. గాంధీలో పీజీ చేస్తున్న అభ్యర్థికి ఇటీవల కరోనా సోకి ఐసోలేషన్‌లో ఉండగా, పరీక్ష రాస్తానని వర్సిటీ ఉప కులపతిని కోరగా ఆయన వెంటనే అనుమతిస్తూ గాంధీ వైద్య కాలేజీలో ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేయించారు.

Next Story

Most Viewed