ఐపీఎల్ కొత్త లోగో ఆవిష్కరణ

by  |
ఐపీఎల్ కొత్త లోగో ఆవిష్కరణ
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ipl) 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 మధ్య యూఏఈలో జరుగనుంది. ఇండో-చైనా ఘర్షణల నేపథ్యంలో ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్‌గా మొబైల్ కంపెనీ వీవో వైదొలగడంతో ‘డ్రీమ్ ఎలెవెన్’ (dream11)కు బీసీసీఐ స్పాన్సర్‌షిప్ కట్టబెట్టింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ లోగోను మార్చాల్సిన అవసరం ఏర్పడింది.

కొత్త టైటిల్ స్పాన్సర్ డ్రీమ్ ఎలెవెన్ లోగోతో కూడిన కొత్త ఐపీఎల్ లోగోను బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. ఈ ఏడాది జరిగే 60 మ్యాచ్‌లకు ఇదే లోగో ఉపయోగిస్తారు. అందరూ కూడా ఈ సీజన్‌ను ‘డ్రీమ్ ఎలెవెన్ ఐపీఎల్’గా (dream11) సంబోధించాల్సి ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. వీవో లోగో స్థానంలో డ్రీమ్ ఎలెవెన్ అని ఉంది. డ్రీమ్ ఎలెవెన్ బ్యాక్ గ్రౌండ్ ఎరుపు రంగులో ఉంది. ఐపీఎల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లోనూ కొత్త లోగోని షేర్‌ చేసింది. ఇక ముంబై ఇండియన్స్‌ జట్టు కూడా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఐపీఎల్‌ 2020 లోగో సోషల్ మీడియాలో వైరల్ అయింది.



Next Story

Most Viewed