భారత జట్టుకు రూ.5 కోట్ల నజరానా

by  |
భారత జట్టుకు రూ.5 కోట్ల నజరానా
X

దిశ,వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాను ఆ దేశ సొంత గడ్డపై ఓడించి భారత జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం నేపథ్యంలో భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనికి తోడు బీసీసీఐ భారత జట్టుపై కాసుల వర్షం కురిపించింది. అద్బుత ఆట తీరు కనబరిచి బోర్డర్-గవాస్కర్ ట్రోపిని కైవసం చేసుకున్న భారత్ జట్టుకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ తన ట్విట్టర్ అధికారిక ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇదో అపూర్వ విజయమని, అస్ట్రేలియా గడ్డపై టీమిండియా నమోదు చేసిన ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కొనియాడారు. సిరీస్‌లో భారత జట్టు ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరును కనబరచారని అన్నారు. బీసీసీఐ తరఫున భారత జట్టుకు 5 కోట్ల రూపాయల బోనస్‌ను ప్రకటిస్తున్నట్టు చెప్పారు.

Next Story