కేంద్రాన్ని ఒప్పించండి సారూ..

by  |
కేంద్రాన్ని ఒప్పించండి సారూ..
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ కుల గణనకు మద్ధతివ్వండంటూ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్​లక్మణ్​ను బీసీ సంఘాలు కోరాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో బీసీ సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ.. త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో బీసీ కులగణన జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు. దీని కొరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరపాలన్నారు.

ఈ కార్యక్రమంలో జాజుల శ్రీనివాస్​గౌడ్, కనకాల శ్యామ్, జాజుల లింగం, మాదేశి రాజేందర్, గూడూరు భాస్కర్, బండిగారి రాజు గౌడ్, నాగరాజు, రాంప్రసాద్, సాయి పవన్, రాజేష్, సాయి తేజ, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed