- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : రాజేంద్రనగర్లో దారుణం చోటుచేసుకుంది. భవానీ రెస్టారెంట్ అండ్ బార్ యాజమాన్యం కస్టమర్లపై దాడులకు తెగబడినట్టు తెలుస్తోంది. రెస్టారెంట్ బిల్లు విషయంలో వివాదం చెలరేగడంతో బార్ సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడినట్టు సమాచారం. డబ్బులు చెల్లించలేదని వీధిరౌడీల్లా బార్ యాజమాన్యం వ్యవహరించిందని కస్టమర్లు చెబుతున్నారు.
అందులో పనిచేసే యువకులు కర్రలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడినట్టు బాధిత కస్టమర్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ముగ్గురు కస్టమర్లు తీవ్రంగా గాయపడగా.. వారికి కొట్టుకుంటూ రోడ్డుపైకి ఈడ్చుకొచ్చినట్టు తెలిసింది. అక్కడ పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బార్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.