ఈటలపై ఒకే.. మల్లారెడ్డి, పువ్వాడపై ఏం చర్యలు తీసుకుంటరు : భట్టి

by  |
ఈటలపై ఒకే.. మల్లారెడ్డి, పువ్వాడపై ఏం చర్యలు తీసుకుంటరు : భట్టి
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో విపరీతంగా నమోదవుతున్న కరోనా కేసుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ముఖ్యమంత్రి కొత్త నాటకానికి తెరలేపారని కాంగ్రెస్ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈటలపై ఆరోపణలు బయటపెట్టారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆక్రమణలకు గురైన భూములను ప్రజలకు ఇవ్వాలన్నారు.

ఈటలపై చర్యలకు ఉపక్రమించారు కానీ, అవే ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి మల్లారెడ్డి మీద ఎందుకు విచారణకు ఆదేశించలేదని భట్టి ప్రశ్నించారు. పువ్వాడ అజయ్ మీద కబ్జా ఆరోపణలు వచ్చాయని, అప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికే ముఖ్యమంత్రి కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Next Story