ఘనంగా ‘బసవతారకం’ 20వ వార్షికోత్సవం

by  |
ఘనంగా ‘బసవతారకం’ 20వ వార్షికోత్సవం
X

దిశ , హైదరాబాద్: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చేతుల మీదుగా ప్రారంభించబడిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇనిస్టిట్యూట్ 20వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఆవరణలోని మాజీ సీఎం నందమూరి తారక రామారావు, బసవతారకం ల విగ్రహాలకు హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ పుష్పాంజలి ఘటించారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర్ రాజన్ లు ఇనిస్టిట్యూట్ అందిస్తున్నసేవలను కొనియాడారు. ఈ మేరకు వారు ప్రత్యేకంగా లేఖ రాశారు.

Next Story

Most Viewed